ఆచార్య వాయిదా.. ఇట్స్ అఫీషియల్..!

కరోనా ఎఫెక్ట్ మిగతా సినిమాలతో పోలిస్తే ఆచార్య మీదనే ఎక్కువగా పడింది. కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. లేదంటే ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి కావాల్సింది. ఇక చిత్ర యూనిట్ సినిమాను మే 13న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుంది. థియేటర్ లు కూడా దాదాపు మూతపడ్డాయి. దాంతో ఆచార్య సినిమా విడుదల ను వాయిదా వేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటన విడుదల చేసింది. ఆచార్య నిర్మాణసంస్థ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ ట్విట్టర్ లో ప్రకటన విడుదల చేసింది.
కరోనా విజృంభన కారణంగా సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అంతే కాకుండా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. చరణ్ సినిమాలో సిద్ధ అనే పాత్రలో నటిస్తుండగా జోడీగా పూజా హెడ్గే నటిస్తోంది. అంతే కాకుండా సినిమాలో రియల్ హీరో సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నారు.