రాహుల్ తో కలిసి బిజెపి ఫై నిప్పులు చెరిగిన కమల్ హాసన్

రాహుల్ తో కలిసి బిజెపి ఫై నిప్పులు చెరిగిన కమల్ హాసన్

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తో కలిసి బిజెపి ఫై నిప్పులు చెరిగారు కమల్ హాసన్. కొద్దీ రోజుల క్రితం రాహుల్ తో కలిసి భారత్ జోడో యాత్ర లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇరువురు దేశ రాజకీయాల గురించి , బిజెపి పరిపాలన గురించి మాట్లాడుకున్నారు. దీనికి సంబదించిన వీడియో ను రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

ఈ సందర్బంగా ఇరువురు.. చైనాతో సరిహద్దు వివాదం, వ్యవసాయంలో సమస్యలు ఇలా…ఎన్నో అంశాలపై ఇద్దరూ తమ అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్ జోడో యాత్రకు మద్దతు తెలిపినందుకు రాహుల్..కమల్ హాసన్‌కు థాంక్స్ తెలిపారు. ఆ తరవాత కమల్..బీజేపీపై నిప్పులు చెరిగారు. “దేశ రాజకీయాల్లో ఈరోజు ఏం జరుగుతోందో మాట్లాడాల్సిన సమయం వచ్చింది. చెమట, రక్తం ధార పోసి మరీ ఇన్ని వేల కిలోమీటర్లు మీరు యాత్ర చేశారు” అని రాహుల్‌ను ప్రశంసించారు. మహాత్మా గాంధీ గురించి కూడా ప్రస్తావించారు. “నా 24-25 ఏళ్ల వయసులో గాంధీని అర్థం చేసుకున్నాను. అందుకే హే రామ్ సినిమా తీశాను. ఆయనకు నా సినిమా ద్వారా సారీ చెప్పాను” అని అన్నారు కమల్.

ఆ తరవాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. “విద్వేషం కారణంగా మన కళ్లు మూసుకుపోతాయి. అపార్థాలూ వస్తాయి” అని అన్నారు. ఇందుకు కమల్ సమాధానం ఇస్తూ..”ఈ విద్వేషం హత్యలూ చేయిస్తుంది” అని స్పష్టం చేశారు. ఇక తమిళ భాష గురించి కూడా కమల్ ఘాటుగా మాట్లాడారు.

కేంద్రం పదేపదే హిందీని జాతీయ భాష చేస్తామంటూ సంకేతాలిస్తున్న నేపథ్యంలో…మోడీ సర్కార్‌కు చురకలు అంటించారు. “అందరిలాగే మేమూ మా మాతృభాషను గౌరవిస్తున్నాం. గర్విస్తున్నాం. మతం, దేవుడు లాంటి విశ్వాసాలు లేని వాళ్లు కూడా తమిళాన్ని గౌరవిస్తున్నారు” అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ..కమల్‌ హాసన్‌కు ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు. పులి నీళ్లు తాగుతున్న ఫోటో ఫ్రేమ్‌ను బహుకరించారు. “జీవితాన్ని మీరు చూసే కోణం అద్భుతం. ఈ ఫోటో మీ వైఖరికి అద్దం పడుతుంది. మీరు గొప్ప ఛాంపియన్” అంటూ కమల్‌ను ప్రశంసించారు.

follow us