మెట్రో రెండో దశ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

మెట్రో రెండో దశ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

మైండ్‌స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వ‌ర‌కు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మెట్రో మార్గానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. నాగోల్‌-రాయదుర్గం కారిడార్‌-3కు కొనసాగింపుగా రాయదుర్గం నుంచి శంషాబాద్‌ విమానాశ్రయం వరకు నిర్మించే ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ మెట్రోకు గచ్చిబౌలి సమీపంలోని ఐకియా ఎదుట ఉన్న మైండ్‌స్పేస్‌ వద్ద శంకుస్థాపన చేసారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, మంత్రులు కేటీఆర్‌, మ‌హ‌ముద్ అలీ, సబిత, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, మ‌ల్లారెడ్డి, ఎంపీలు కేశ‌వ‌రావు, రంజిత్ రెడ్డి, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి, హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తదితరులు పాల్గొన్నారు.

ఐటీ హబ్ మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి 31 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో లైన్ను ప్రభుత్వం నిర్మించనుంది. మైండ్ స్పేస్ నుంచి గచ్చిబౌలి, నానక్ రాంగూడ జంక్షన్ల నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు కొత్త మెట్రో రైలు నడవనుంది. మొత్తం 31 కిలోమీట‌ర్ల మేర నిర్మించే ఎక్స్ ప్రెస్ మెట్రోకు రూ. 6,250 కోట్ల వ్యయం అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మెట్రో ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించనుంది. మొత్తం ఈ మార్గంలో 9 స్టేషన్‌లు ఉండనున్నాయి.

follow us

Related News