విజయ్ దేవేరుకోండ నిర్మించిన మీకు మాత్రమే చెప్తా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చింది .. మిక్స్డ్ టాక్ తో బాగానే జనాల్లోకి వెళ్ళింది .
ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ కి అనసూయ ని సరిగా పిలవలేదు అని గుసగుసలు వినిపిస్తున్నాయి . ఇంకా ఆమె తో టీం కి అవసరం లేదు కాబట్టి.
అనసూయ కూడా విజయ్ దేవేరుకోండ ఆమె గురించి చెప్పిన సమాధానం తో అంత సుముఖంగా లేరు అని వినికిడి . మీ గురించి ఆమె నెగటివ్ గా మాట్లాడింది కదా అర్జున్ రెడ్డి సినిమా అప్పుడు మరి ఇప్పుడు ఆమె ని ఎలా మీ సినిమా లో తీసుకున్నారు అని మీడియా అడిగిన ప్రశ్న కి విజయ్ నేను దర్శకుడు ని కాదు కదా .. ఆయన ఇష్ట ప్రకారమే క్యాస్టింగ్ నడిచింది నేను అయితే తీసుకునేవాడిని కాదు ఏమో అని అన్నాడు.
అనసూయ మాత్రం ఈ సినిమా కోసం రిలీజ్ ముందు బాగానే ప్రమోట్ చేసింది