పంచతంత్రం ట్రైలర్ విడుదలైంది

స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు.
‘పంచతంత్రం’ ట్రైలర్ను గమనిస్తే.. ఇది 5 జంటలకు సంబంధించిన కథ అని అర్థమవుతుంది. డా.బ్రహ్మానందం ఈ ఐదు కథలకు పంచేద్రియాలు అనే పేరు పెట్టి తన కోణంలో స్టార్ట్ చేస్తారని ట్రైలర్ను చూస్తే అర్థమవుతుంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. సంతోషాలే కాదు.. బాధలు కూడా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు మనం వాటిని ఎలా స్వీకరించాం. మన పనులను ఎంత బాధ్యతగా పూర్తి చేస్తూ ముందుకెళ్లామనేది కథాంశం అని క్లియర్గా తెలుస్తుంది. సినిమాలో మనకు కనిపించబోయే ఐదు జంటలకు ఒక్కో కథ .. ఒక్కో రకమైన ప్రయాణం.. అవన్నీ ఎలాంటి ముగింపుతో ఎండ్ అయ్యాయనే ‘పంచతంత్రం’ సినిమా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో ముందుకు సాగుతుంది.
ప్రతి కథలో మన చుట్టూ ఉన్న సమాజాన్ని అందులో వ్యక్తుల వ్యక్తిత్వాలను దర్శకుడు హర్ష ఎంతో అర్థవంతంగా ముందుకు తీసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి ఫీల్ గుడ్ యాంథాలజీని దర్శకుడు ఎలా ట్రీట చేశారనే ఎగ్జయిట్మెంట్ కూడా కలుగుతుంది.
అర్థవంతమైన సంభాషణలు ప్రతి పాత్రలోని భావోద్వేగాలను సెన్సిబుల్గా ఎలివేట్ చేస్తున్నాయి.
ప్రశాంత్ ఆర్.విహారి సంగీతం, నేపథ్య సంగీతం.. రాజ్ కె.నల్లి సినిమాటోగ్రఫీ సన్నివేశాలను, వాటిలోని ఎమోషన్స్ను నెక్స్ లెవల్కు తీసుకెళ్లాయి. ట్రైలర్ చూస్తున్నప్పుడు మనసుకు తెలియని ఆర్ద్రత కలుగుతుంది. సినిమాను ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్పై చూద్దామా అనే ఆసక్తి పెరుగుతుంది.