తడ్కా అంటూ మరో మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ ని వదిలిన డైరెక్టర్ పూరి

డైరెక్టర్ పూరి మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ ను మళ్లీ మొదలుపెట్టాడు. కరోనా లాక్ డౌన్ టైం లో మ్యూజింగ్స్ పాడ్ కాస్ట్ ను మొదలుపెట్టి ఎన్నో విభిన్న విషయాలు షేర్ చేసుకున్న పూరి..లైగర్ దెబ్బ కు మళ్లీ మొదలుపెట్టాడు. ఈసారి తడ్కా గురించి తన మనసులోని మాటలను తెలిపాడు. తడ్కా అంటే తాలింపు అని. జీవితంలో సగం గొడవలు దీనివల్లే అంటూ వివరణ ఇచ్చారు పూరి.. ఇంకా ఆయన ఏంచెప్పాడో చూస్తే..
“మనం ఒక మనిషిని ఇంకొ మనిషి దగ్గరికి ఏదో పని మీద పంపిస్తాం..అతను తిరిగొచ్చి ఏం జరిగిందో చెప్పడు. అవతలి వ్యక్తి ఏమన్నాడనేది తప్ప మిగిలినవన్నీ చెబుతాడు. ఏం జరిగింది ? అని అడిగితే.. మంచి రోజులు కావు.. నువ్వు ఎంత చేసినా మంచి ఫలితం ఉండదు. అతడు అలా మాట్లాడటం నాకు నచ్చలేదు. నువ్వు ఎంత చేశావు అతనికి.. నాలుగు డబ్బులు వచ్చేసరికి పొగరుగా మాట్లాడుతున్నాడు. నేను కాబట్టి ఊరుకున్నా. వాడి మాటలు వింటే నువ్వు కొడతావు అంటూ చెబుతాడు. ఇదంతా కాదు.. ఆయన ఏమన్నాడో చెప్పు అని గట్టిగా అడిగితే డబ్బులిచ్చి పట్టుకెళ్లమన్నాడు అంటూ తీరిగ్గా చెబుతాడు. అక్కడ పెనంలో ఉన్నదాన్ని ఇక్కడికి తీసుకోచ్చేలోపోపు తాలింపు వేసి తీసుకొస్తారు. తాలింపు అంటే తడ్కా. జీవితంలో సగడం గొడవలు దీనివల్లే వస్తాయి. జరిగింది సూటిగా చెప్పారు. అసలు విషయం చెప్పకుండా తమ అభిప్రాయాన్ని చెప్పి.. అవతలి వాళ్లను విలన్స్ చేసేస్తాడు. తను ఎలా ఆలోచిస్తాడో.. మనల్ని కూడా నెట్టేసి మన మనసు మొత్తం పాడు చేసి పారేస్తారు. అందుకే మధ్యవర్తులు జరిగింది చెబుతున్నారా ? వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారా ? అనే విషయాన్ని గ్రహించాలి. అందుకే డౌట్ వస్తే అడిగేయ్యాలి. నిజమే చెబుతున్నావా ?.. నువ్వు అనుకున్నది చెబుతున్నావా ? అని అడిగేయాలి. ఆ మధ్యవర్తులు మరెవరో కాదు. మనమే..
అందుకే ముందు జరిగింది మాత్రమే చెప్పాలి. అన్న మాటలే చెప్పాలి. ఆ తర్వాత అడిగితేనే మీ ఓపినియన్ చెప్పాలి. ప్రపంచంలో రోజూ ఈ తడ్కా వల్లే గొడవలు జరుగుతుంటాయి. అందుకే జరిగింది చెప్పడం ప్రాక్టీస్ చేయాలి. ప్రతి ఒక్కరు తడ్కా స్పెషలిస్ట్. తడ్కా లేకుండా ఎవరు ఏ విషయం తీసుకురారు. మనవరకు చేరే ప్రతి వార్త తడ్కా పై తడ్కా. ఐదు తాలింపులు అయ్యాకా.. మరో వ్యక్తి జీడిపప్పు వేసి అరటి ఆకులో పొట్లం కట్టి తీసుకోస్తాడు. వాసన చూసి బాగుంది అనుకుంటాం. కానీ అది నిజం కాదు. అందుకే ఎప్పుడైనా జరిగిందే చెప్పాలి. జాగ్రత్తగా ఉండండి. దయచేసి తడ్కా తగ్గిద్దాం ” అంటూ చెప్పుకొచ్చారు పూరి.