ఎస్పీ బాలు అంత్యక్రియల వివరాలు..

40 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం మరణించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం అంత్యక్రియలు రేపు సాయంత్రం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటల నుండి ఎంజీఎం నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్ ఇంటికి బాలు పార్థీవదేహం తీసుకెళ్లనున్నారు.
చెన్నై తిరువళ్లూరు జిల్లాలో రెడ్హిల్స్ సమీపంలోని తామరైపాకంలో ఎస్పీ బాలు అంత్యక్రియలు చేయనున్నారు.