NH7పై చిరుత

కరోనా లాక్ డౌన్ తో అడవుల్లో ఉండాలిసిన వన్య ప్రాణులు జన సంచార ప్రదేశాలకు వస్తున్నాయి.
రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో కాటేదాన్ రైల్వే ట్రాక్ వద్ద చిరుత NH7 మెయిన్ రోడ్ పై కూర్చొని ఉంది. చిరుత కు గాయాలు కావడంతో ఎటు వెళ్ళని పరిస్థితి లో హైవేపై ఉంది దాన్ని చూసిన కాటేదాన్ ప్రజలు భయాందోళనకు గురయ్యారు, సమాచారం అందుకున్న మైలార్దేవ్పల్లి పోలీసులు చిరుత ఉన్న సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇరువైపుల రోడ్లను బ్లాక్ చేసిన ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. చిరుతని పట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు అధికారులు.